జర్నలిస్టులకు అండగా కేసీఆర్

జర్నలిస్టులకు అండగా కేసీఆర్

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో రాష్ట్ర పండుగలకు పెద్దపీట వేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. అనంతరం మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... రాష్ట్రం ఏర్పాడ్డాక మన పండుగల గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కవిత తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు తగిన గౌరవం ఉంటుందని, వారికి ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పథకాలతో రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని, భవిష్యత్తులో మరింత ముందుకు పోతామని కవిత స్పష్టం చేశారు.