ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్‌

ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్‌

ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఫిబ్రవరి 8న రాజ్యసభలో చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ మీద టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. రాజ్యసభ చైర్మన్ కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందించారు. తెలంగాణను అవమానించారని ఆ నోటీసులో TRS ఎంపీలు పేర్కొన్నారు. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్‌లో  పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని టీఆర్ఎస్ ఎంపీలు అంటున్నారు. మరోవైపు రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఇవాళ ఆందోళనకు దిగారు.  ఛైర్మన్ వెల్  వద్ద నిరసన తెలిపారు.