యాదాద్రి, వెలుగు : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని టీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. భువనగిరిలోని పార్టీ ఆఫీస్లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సహా సిట్టింగ్లందరికీ సీఎం కేసీఆర్ టికెట్లు ఇస్తారని తెలిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ వీడుతారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. జిల్లాకు చెందిన లీడర్ల మధ్య విభేదాలు, గ్రూప్లు ఉన్నమాట వాస్తవమేనని, తాను కూడా బాధితుడినేనన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతు సమస్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.