BJP కన్నా TRS సభ్యత్వాలే ఎక్కువ : KTR

BJP కన్నా TRS సభ్యత్వాలే ఎక్కువ : KTR

టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసుకుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు.గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ లతో కేటిఆర్ మాట్లాడుతూ.. ఇంతటి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు కోసం కృషి చేసిన వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కన్నా బలమైన పార్టీ మరేదీ లేదని ఈ సభ్యత్వ నమోదుతో మరోసారి స్పష్టమైందన్నారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్, వర్ధన్నపేట మొదటి స్థానంలో నిలిచాయన్న కేటీఆర్.. టీఆర్ఎస్ కన్నా బీజేపీ చాలా తక్కువ సభ్యత్వం నమోదు చేసిందని.. ఆ పార్టీ సభ్యత్వం కేవలం 12లక్షలేనని తెలిపారు.

దసరాకల్లా పార్టీ  నిర్మాణాలు పూర్తి కావాలని కేటీఆర్ అన్నారు. ఈ నెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని, కమిటీలన్నీ ప్రభుత్వం, ప్రజలకు వారధిగా పనిచెయ్యాలన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నియోజకవర్గాల వారిగా పార్టీ సమీక్షా సమావేశాలలు జరుగుతాయన్నారు కేటీఆర్.