తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష: తలసాని

తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష: తలసాని

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ రావడం ఓ చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అన్నారాయన. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు రిజర్వేషన్ల పై కొందరు గగ్గోలు పెట్టారని, బడుగు బలహీవర్గాలకు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రాధాన్యం గతంలో ఎవ్వరూ ఇవ్వలేదని అన్నారాయన.

రాజకీయంగా గుర్తింపు లేని కులాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ సామాజిక కోణంలో ముందుకు వెళుతున్నారని, అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారని అన్నారు. సామాజిక తెలంగాణ అంటే ఇంతకు మించి ఏమీ వుండదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా డ్రామాలు చేస్తున్నారని, ఎక్స్ అఫిషియో సభ్యుల విషయంలో ఉత్తమ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.