కారు ఢీకొని TRS కార్యకర్త మృతి

కారు ఢీకొని TRS కార్యకర్త మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హుజుర్ నగర్ (మం) మాధవగూడెం దగ్గర కారు ఢీకొని టీఆర్ఎస్ కార్యకర్త జగన్ మృతిచెందాడు. 35 ఏళ్ల జగన్.. కేటీఆర్ రోడ్ షోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ హుజూర్ నగర్ టౌన్ లో రోడ్ షో చేశారు. ఈ రోడ్ షోలో పాల్గొనేందుకు జగన్ వెళ్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్త మృతిపై పార్టీ సంతాపం ప్రకటించింది. కార్యకర్త అయిన జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపింది.