అన్ని వార్డుల్లో మనమే గెలవాలి: కేటీఆర్

అన్ని వార్డుల్లో మనమే గెలవాలి: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలోని అన్ని వార్డుల్లో టీఆర్ఎస్సే గెలవాలన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం సిరిసిల్ల లో టీఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గోన్న కేటీఆర్.. ఈ నెల 15 లోగా టీఆర్ఎస్ కార్యకర్తలు రోజుకో గంట వార్డుల్లోని ప్రతీ ఇంటికి తిరిగి వారి కష్టాలు తెలుసుకోవాలని, ఆ విషయాలు తనకు చెప్తే వాటిని పరిష్కరిద్దామని అన్నారు. ఇప్పటిదాకా సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని, జరగబోయే అభివృద్ధిని ప్రజలకు తెలపాలని ఆదేశించారు.

మిడ్ మానేరు నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవాలని కాంగ్రెస్ చూస్తోందని, 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన  మానేరు నిర్వాసితులకు తామే పరిహారం ఇచ్చామన్నారు కేటీఆర్. నిర్వాసితులకు రూ. 350 కోట్లు ఇచ్చామన్నారు. డబ్బులు తీసుకున్నోళ్లను కూడా కాంగ్రెస్ నాయకులు  రెచ్చగొట్టి ధర్నాకు తీసుకువచ్చారని,  వేములవాడ సొమ్ము తిన్నోళ్లు కూడా తమను వేముల వాడకు ఏమీ చేయలేదని తిడుతున్నారని విమర్శించారు