హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ రేపు ఉదయం 11.30గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. యాసంగి వడ్ల కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిన్నటి ఫాంహౌస్ మీటింగ్ సీఎం నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం.. రేపు దీనిపై రూట్ మ్యాప్ ప్రకటించనున్నారు.
పంజాబ్ లో 100శాతం కేంద్రం ధాన్యం సేకరిస్తుందని... అదే తరహాలో మన దగ్గర కూడా 100 శాతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) సేకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలవాలని డిసైడ్ చేశారు. అటు లోక్ సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతారని సీఎం కార్యాలయం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
