హైదరాబాద్, వెలుగు: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని, సీఎం తన కామెంట్లను వెనక్కి తీసుకుని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్టీపీ డిమాండ్ చేసింది. ఇంకోసారి కొత్త రాజ్యాంగ విషయాన్ని లేవనెత్తితే ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో లీడర్లు రాజగోపాల్, సత్యవతి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవహేళన చేసిన సీఎం కేసీఆర్.. ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలని సోమన్న డిమాండ్ చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని.. కేసీఆర్నే అని మండిపడ్డారు. తలపొగరుతో మాట్లాడుతున్న కేసీఆర్కు ప్రజలే సరైన టైమ్లో బుద్ధి చెబుతారన్నారు. 72 ఏండ్ల దేశ చరిత్రలో ఏ ఒక్కరూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పలేదని, అంత గొప్ప రాజ్యాంగాన్ని కేసీఆర్ లాంటి నియంత మార్చాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మొదటి నుంచి దళితులంటే కేసీఆర్ చిన్నచూపేనని, అందుకే దళిత సీఎం, మూడెకరాల భూమి, కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదన్నారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు దళిత బంధు తెచ్చారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దళితుల పట్ల కేసీఆర్కు ఉన్న వివక్ష ఏమిటో అర్థమవుతోందని సత్యవతి అన్నారు.
ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్టీపీ నిరసన
- హైదరాబాద్
- February 7, 2022
లేటెస్ట్
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు