ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో  ఉగ్రవాదులు  రెచ్చిపోయారు. బిజ్ బెహరా  ప్రాంతంలో ఓ ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపారు.  అంతకుముందు  సొపోర్ లోని   బస్టాండ్ లో గ్రెనేడ్   విసిరారు. ఈ ఘటనలో  19 మందికి  పైగా  గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి   తీవ్ర గాయాలయ్యాయి . క్షతగాత్రుల్ని  శ్రీనగర్  హాస్పిటల్ కు తరలించారు . యురోపియన్  ఎంపీల  బృందం   ఇవాళ  కశ్మీర్ లోయలో పర్యటించనుంది.  వీరి పర్యటనకు  ముందే  ఉగ్రదాడి  జరగడంతో  భద్రతా బలగాలు  అలర్ట్ అయ్యాయి.