హైడ్రాక్సీ క్లోరోక్విన్ను భారత్ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధం విధించిన భారత్… మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీంతో ట్రంప్ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్పై ప్రశంసలు కురిపించారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ను ఇప్పటికే కొన్ని మిలియన్ డోసులు కొన్నామని తెలిపారు ట్రంప్. దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నట్లు తెలిపారు. భారత ప్రధాని మోడీతో మాట్లాడానని.. భారత్ నుంచి తమకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉందన్నారు. వాటిని పంపించేందుకు మోడీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మోడీ చాలా మంచి దృక్పథంతో ఉన్నారన్న ట్రంప్. భారత్కు కూడా ఆ డ్రగ్స్ చాలా అవసరం అందుకే వాటి ఎగుమతులను ఆపేశారన్నారు.