రామ మందిరం ప్రారంభోత్సవానికి రండి.. మోదీకి ఆహ్వానం

రామ మందిరం ప్రారంభోత్సవానికి రండి..  మోదీకి ఆహ్వానం

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ట్రస్ట్ సభ్యులు బుధవారం ప్రధాని నివాసానికి వెళ్లారు.

మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడగలగడం తన అదృష్టమని మోదీ పేర్కొన్నారు.