వాయిదాపడ్డ ఎంసెట్, ఈసెట్ తేదీలు ఖరారు

వాయిదాపడ్డ ఎంసెట్, ఈసెట్ తేదీలు ఖరారు

ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్ష వాయిదాపడటంతో కొత్త తేదీలు ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆయా వెబ్ సైట్ల నుంచి కొత్త హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.