
హైదరాబాద్, వెలుగు : మానసిక దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగుల వివరాలు ఇవ్వాలని ప్రభు త్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రాల్లో వారికి కల్పిస్తున్న వసతుల వివరాలు తెలపాలని సూచించింది.
మాన సిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017ను అమలు చేయడం లేదంటూ సంగారెడ్డి జిల్లా లోని ఇంటిగ్రేటెడ్ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకే షన్ అండ్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో దాఖ లు చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్శుక్రవారం విచారించింది.
31,844 మం దికి మానసిక వైకల్యం ఉన్నట్టు గుర్తించా మని, 29,994 మందికి వైద్యం చేయించి వాళ్ల ఇండ్లకు పం పించామని తెలిపింది. 27 మంది వేర్వేరు కారణాలతో చనిపో యారని ప్రభుత్వం చెప్పింది. కౌంటర్ దాఖ లు చేయాలని గవర్నమెంట్ ను.. తగిన సూ చనలతో రావాలని పిటిషనర్ కోర్టు ఆదేశించింది.