ఆన్‌లైన్‌లో రాములోరి తలంబ్రాలు.. భక్తులకు టీఎస్​ఆర్టీసీ ఏర్పాట్లు

ఆన్‌లైన్‌లో రాములోరి తలంబ్రాలు.. భక్తులకు టీఎస్​ఆర్టీసీ ఏర్పాట్లు

హైదరాబాద్,వెలుగు: భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్​లైన్​లో బుక్​ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని టీఎస్​ ఆర్టీసీ మేనేజింగ్​డైరెక్టర్​ వీసీ సజ్జనార్​ తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ ​ఆయన తెలిపారు. సంస్థ లాజిస్టిక్స్​విభాగ వెబ్​సైట్ ను సందర్శించి రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందవచ్చని ఆయన సూచించారు. అలాగే ఆఫ్​లైన్​లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్​ ఆర్టీసీ కాల్​సెంటర్​ 040-2345 0033, 040- 6944 0000, 040-6944 0069 నంబర్లను సంప్రదించాలన్నారు.