- టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: మహబూబ్నగర్ పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార్లు కరెంట్ పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ ఎస్పీడీసీఎల్ ఖండించింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో గానీ, ఆ చుట్టుపక్కల గానీ కరెంట్ పోలేదని స్పష్టం చేసింది. ఆ టైమ్ లో ఎలాంటి పవర్ కట్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.
కేసీఆర్ చెప్పిన విషయాన్ని నమ్మి కొన్ని మీడియా సంస్థలు కరెంట్ పోయినట్టు రిపోర్ట్ చేశాయని, కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఎస్పీడీసీఎల్ తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘సంబంధిత సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ డిజిటల్ మీటర్లలో ఎక్కడ కూడా కరెంట్కట్అయినట్టు రికార్డు కాలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ఇంటికి ఎలాంటి కోతలు లేకుండా కరెంట్అందుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ కరెంట్పోయిందని చేసిన ఆరోపణలు అవాస్తవం” అని టీఎస్ఎస్పీడీసీఎల్ మహబూబ్నగర్ ఆపరేషన్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు.