మున్సిపల్ ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని వారంతా ఫొటో ఎలక్టోరల్ రోల్లో తమ పేర్లు ఉన్నాయో, లేవో సరి చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో సూచించింది. పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది జనవరి ఒకటో తేదీని కటాఫ్ పెట్టుకొని ప్రచురించిన ఓటరు జాబితాను ఆయా మున్సిపల్ కమిషనర్లు జూలై16న ప్రకటించారని తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ( https://tsec.gov.in/) లోని ఓటర్ పోర్టల్లోకి వెళ్లి ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి18 ఏళ్లు నిండిన వారి పేర్లు జాబితాలో లేకుంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించింది.