ఎల్లుండి పదో తరగతి పరీక్ష ఫలితాలు

ఎల్లుండి పదో తరగతి పరీక్ష ఫలితాలు

పదో తరగతి పరీక్ష  ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. జూన్ 30 ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని MCRHRDలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. విద్యార్థులు కింది వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

https://bse.telangana.gov.in/

http://www.bseresults.telangana.gov.in/

రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. దాదాపు 5లక్షలకుపైగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో సిలబస్ ను 70శాతానికి కుదించి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు తగ్గించారు.