న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్లో మన పర్మినెంట్ రిప్రెజెంటేటివ్గా టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. తిరుమూర్తి 1985కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం విదేశాంగశాఖలో సెక్రటరీగా ఉన్న ఆయన త్వరలో రిటైర్ కాబోతున్న సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో నియమితులైనట్టు మినిస్ట్రీ ఆఫ్ఎక్స్టర్నల్ఎఫైర్స్(ఎమ్ఈఏ) బుధవారం వెల్లడించింది.
యూఎన్ పర్మినెంట్ ప్రతినిధిగా అక్బరుద్దీన్ కీలక పాత్ర పోషించారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను యూఎన్ గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించేలా చేయడంలోనూ, ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని చైనా ప్రస్తావించకుండా అడ్డుకోవడంలోనూ అక్బరుద్దీన్ తీవ్రంగా కృషిచేశారు.

