హైదరాబాద్, వెలుగు:
ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ప్రాసెస్చేసే సామర్థ్యం సెంటర్ఫర్గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కు ఉందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ పరీక్షల ప్రక్రియ నిర్వహించిన అనుభవం లేకపోవడం, సిబ్బంది కొరత, ఇంతకుముందు సీజీజీ చేసిన గ్రూప్–1, దోస్త్ ప్రక్రియల్లో లోపాలు బయటపడిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాల నేపథ్యంలో ఈసారి అడ్మిషన్లు మొదలు రిజల్ట్స్వరకూ ప్రాసెస్అంతా సీజీజీకి అప్పగించినట్టు ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. అయితే గతేడాది వివాదానికి కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగిస్తున్నట్టు ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
గత ఏడాది దెబ్బతో..
ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈసారి ఫస్టియర్లో 4,79,676 మంది, సెకండియర్లో 4,83,003 మంది పరీక్ష రాయబోతున్నారు. గతేడాది ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడంతో ఫలితాలను డేటా ప్రాసెసింగ్ చేసిన గ్లోబరీనాపై అందరి దృష్టి పడింది. ఆ సంస్థతో ఇంటర్బోర్డు అధికారికంగా ఒప్పందం చేసుకోకపోవడం, వర్క్ ఆర్డర్ బేస్డ్గానే రిజల్ట్స్ ప్రాసెస్ చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వ పెద్దలు, బోర్డు గ్లోబరీనాను వెనకేసుకొచ్చారు. అయితే తప్పిదాలపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్కమిటీ సిఫారసుల మేరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు మాత్రం గ్లోబరీనాకు సమాంతరంగా జేఎన్టీయూ సహకారంతో డేటాటెక్సంస్థతో ఫలితాల ప్రాసెసింగ్నిర్వహించారు. అప్పట్లో ఈ అంశంపై ఢిల్లీ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో ఈవిద్యాసంవత్సరం ఈ ప్రక్రియను మళ్లీ గ్లోబరీనాకే సంస్థకే అప్పగిస్తే, ఫలితాల్లో చిన్న తప్పిదం వచ్చినా.. పెద్ద వివాదమయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబరీనాను పక్కన పెట్టి, వేరే సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే గతేడాది ఫలితాల్లో తప్పిదాలకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు.
సీజీజీకి అప్పగింత…
గవర్నమెంట్సంస్థగా పేరున్న సీజీజీకి ఈ ఏడాది ఇంటర్ఫలితాల ప్రాసెస్నూ అప్పగించారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ల ప్రాసెస్ను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తే సిబ్బంది కొరత ఉందని దానికి సీజీజీ అంగీకరించలేదు. దీంతో విద్యాశాఖ ముఖ్య అధికారులు రంగంలోకి దిగి ఆ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారనే వాదనలు ఉన్నాయి. ఈక్రమంలో ఫలితాల ప్రక్రియ మొత్తాన్ని సీజీజీకి అప్పగించేందుకు కొద్దిరోజులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రిజల్ట్స్ ప్రాసెస్కూడా సీజీజీనే చేస్తుందని అధికారికంగా ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్రెండు రోజుల క్రితం ప్రకటించారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆసంస్థకు పరీక్షల ప్రాసెస్చేసే సత్తా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రెండేండ్ల క్రితం గ్రూప్1 ఫలితాల్లో గందరగోళం ఏర్పడితే, సీజీజీ తప్పిదంతోనే అని టీఎస్పీఎస్సీ ప్రకటించి, రెండోసారి రిజల్ట్స్ను విడుదల చేసింది. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల(దోస్త్) విషయంలోనూ గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దోస్త్సీట్ల అలాంట్మెంట్ కూడా రెండోసారి చేయాల్సి వచ్చింది.