806 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్​పీఎస్సీ

806 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్​పీఎస్సీ
  • డిగ్రీ కాలేజీల్లో 544, ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌లో 71 పోస్టులు
  • మున్సిపల్ శాఖలో 78, ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో 113 ఖాళీల భర్తీ
  • జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు
  • మే లేదా జూన్​లో ఎగ్జామ్​ నిర్వహించే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: మరో 4 నోటిఫికేషన్లను టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లోని 806 పోస్టులకు శనివారం నోటిఫికేషన్లు ఇచ్చింది. కాలేజియెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (డిగ్రీ లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 దాకా ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21 నుంచి అప్లికేషన్లను తీసుకోనుంది. ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తులను స్వీకరించనుంది. 

వీటన్నింటికి మే లేదా జూన్​లో ఎగ్జామ్​ను నిర్వహించే అవకాశమున్నట్టు నోటిఫికేషన్​లో పేర్కొంది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 78 పోస్టులకు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులను తీసుకోనుంది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ (ఎంవీఐ) పోస్టులను భర్తీ చేసేందుకు జనవరి 12వ తేదీ నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లను తీసుకోనుంది. ఫిబ్రవరి 1 దాకా దరఖాస్తులను స్వీకరించనుంది. ఎంవీఐ పోస్టులకుఏప్రిల్ 23న ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్టు టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేర్కొంది.