మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ బస్సు..

మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ బస్సు..

వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వంపై ఉన్న భారాన్ని తగ్గించుకోవడంతో పాటు.. ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకుంటోంది. తాజాగా మహిళా ప్రయాణికుల కోసం కోఠి నుంచి కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. 

ఆగస్టు 21 (సోమవారం) నుంచి 127K నంబర్ ప్రత్యేక బస్సు ప్రారంభం కానుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సు ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుందని వెల్లడించింది. లక్దికాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్ మీదుగా ఈ బస్సు కొండాపూర్ కి వెళ్తుందని ఆర్టీసీ ప్రకటించింది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుందని తెలిపింది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది.