Good News : గోదావరిఖని నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

Good News : గోదావరిఖని నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి  రాజధాని బస్సు సర్వీస్‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవలని ఆర్టీసీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈడీ పి.సోలమాన్‌‌‌‌‌‌‌‌ సూచించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్​ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం బి.రాజుతో కలిసి బస్సు సర్వీస్‌‌‌‌‌‌‌‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా పౌర్ణమికి దర్శనం చేసుకునేలా సర్వీస్‌‌‌‌‌‌‌‌ను నడపనున్నట్లు తెలిపారు. 

3 రోజులపాటు సాగే ఈ ప్రయాణానికి రూ.5900, పిల్లలకు రూ.4900 చార్జీ వసూలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం బస్​స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎం ఎం.నాగభూషణం, అసిస్టెంట్​మేనేజర్​ కె.గీతాకృష్ణ, జి.అమృత, శంకరయ్య, కె.సదానందం, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.