పదేపదే హెచ్చరిస్తున్నా సిబ్బందిపై దాడులు చేస్తున్నారు: TSRTC ఎండీ సజ్జనార్

పదేపదే హెచ్చరిస్తున్నా సిబ్బందిపై దాడులు చేస్తున్నారు: TSRTC  ఎండీ సజ్జనార్

హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తున్నా టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇద్దరు వ్యక్తులు ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణా రహితంగా ఆదివారం (ఫిబ్రవరి 4) రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగ్గా..డ్రైవర్ షేక్ అబ్ధుల్ కి గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దోమల్ గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాద చేశారు. కేసు నమోదు అయింది. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యావాదాలు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ సిబ్బందిపై దాడు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని  టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం మరోసారి హెచ్చరిస్తోంది.