లేడీస్ స్పెషల్.. చార్మినార్ నుంచి ఉచిత బస్సు సర్వీసులు..

లేడీస్ స్పెషల్.. చార్మినార్ నుంచి ఉచిత బస్సు సర్వీసులు..

మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గండిమైసమ్మ నుంచి చార్మినార్ మధ్య 'లేడీస్ స్పెషల్' బస్సును ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రకటించింది. సెప్టెంబర్ 13 నుంచి జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, లక్డీకాపూల్, గాంధీభవన్, అఫ్జల్‌గంజ్‌ల మీదుగా ఈ బస్సు నడవనుంది.

TSRTC ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి చార్మినార్ వైపు, చార్మినార్ నుంచి గండిమైసమ్మ వరకు సాయంత్రం 5:20 గంటలకు బస్సు సర్వీసు ప్రారంభమవుతుంది. దీనికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సేవలు ఈ మార్గంలో అమలు చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.