టీటీడీ ఆధ్వర్యంలో యోగా : విద్యార్థుల విజయం యోగాతోనే సాధ్యమన్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి

టీటీడీ ఆధ్వర్యంలో యోగా : విద్యార్థుల విజయం యోగాతోనే సాధ్యమన్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి

ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఉరుకులు, పరుగుల నేటి సమాజంలో.. యోగాతోనే స్థిరత్వం వస్తుందని.. ఆలోచన శక్తి పెరుగుతుందన్నారాయన. జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. టీటీడీ పరిపాలనా భవనం వెనక ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో విద్యార్థులకు యోగా శిబిరం నిర్వహించారు వెంకయ్య చౌదరి. 

ప్రపంచలోని 190 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని.. యోగాతో ఆధ్యాత్మికత పెరుగుతుందని.. మానసిక ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ వస్తుందని.. శారీరకంగా దృఢంగా ఉంటామన్నారు. యువత.. ముఖ్యంగా విద్యార్థులు చదువులో.. కెరీర్ లో విజయం సాధించాలంటే.. ఉన్నత స్థాయికి చేరాలంటే యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. ప్రతి విద్యార్థి.. ప్రతి రోజూ గంటపాటు యోగా చేసినట్లయితే.. విజయం సాధించటం చాలా చాలా ఈజీ అన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. విద్యార్థులే కాకుండా ప్రతి కుటుంబం.. ప్రతి రోజూ ఉదయం యోగా చేసినట్లయితే జీవితంలో ఆందోళన దూరం అవుతుందని సూచించారాయన. 

►ALSO READ | తిరుమలలో భక్తుల సునామీ : ఉచిత దర్శనానికి 25 గంటల సమయం

విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్న ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యతమరింత పెంచేలా ప్రధానమంత్రి మోదీ, సీఎంచంద్రబాబు కృషి చేయటం మంచి పరిణామం అన్నారాయన. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన యోగ శిబిరంలో టీటీడీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

యోగాసనాలు చేసేందుకు వీలుగా భారీ LED స్క్రీన్లు, యోగా మ్యాట్స్, కార్పేట్లు, టిఫిన్లు, టీలు, టీ షర్ట్ లను అందరికీ అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ యోగా శిబిరంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళీ కృష్ణతోపాటు పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.