TTD : భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

TTD : భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. కాలి నడకన వచ్చే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తిరుమల కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

నాలుగంచెల విధానంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. వసతితో పాటుగా లడ్డూ ప్రసాదంలోనూ ఈ విధానం అమలు చేయటం ద్వారా ప్రయోజనం కలుగుతోందన్నారు. అదే విధంగా.. రాష్టంలో ఆదరణ తగ్గిన టిటిడి కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.   టీటీడీలో ప్రవేశ పెట్టిన ఫేస్ రికగ్నజైషేన్  విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు,