పార్లమెంట్ లో ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ

పార్లమెంట్ లో ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ

మరణం..ఇది ఎవరికి ఎప్పుడు..ఎలా వస్తుందో తెలియదు..ఎవరికి చెప్పిరాదు..అటువంటిదే టర్కీ పార్లమెంట్ లో మంగళవారం (డిసెంబర్ 12) ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. టర్కీ పార్లమెంట్ జనరల్ అసెంబ్లీ లో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయిన ఎంపీ మృతిచెందారు. పార్లమెంట్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయిన టర్కీ ఎంపీ హసన్ బిట్మెజ్ గురువారం (డిసెంబర్ 14) మృతిచెందారు. ప్రతిపక్ష ఫెలిసిటీ పార్టీకి చెందిన 54 యేళ్ల ఎంపీ హసన్.. అంకారా సిటీ ఆస్పత్రిలో మరణించారని టర్కీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. 

టర్కీ ఎంపీ హసన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. మనం మనస్పాక్షి నుంచి తప్పంచుకోవచ్చు గానీ చరిత్ర నుంచి కాదు అని హసన్ తీవ్రంగా స్పందించారు. మీరు అల్లా కోపం నుంచి తప్పంచుకోలేరు అంటూ ఇజ్రాయెల్ ను శాపనార్థాలు పెట్టారు. ఇజ్రాయెల్ తో టర్కీ కొనసాగిస్తున్న  వాణిజ్యంపై విరుచుకుపడ్డారు.

సిగ్గు లేకుండా ఇజ్రాయెల్ కు ఓడలు వెళ్లడానికి అనుమతిస్తున్నారని విమర్శించారు. హంతకుడు ఇజ్రాయెల్ కు టర్కీ సహకరిస్తోందని పోడియం  వద్ద ఓ బ్యానర్ కూడా ఉంచాడు. అయితే హసన్ ప్రసంగిస్తుండగానే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. 
మరోవైపు