- టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహాత్ అలీ
గజ్వేల్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రాకతో జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహాత్ అలీ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మల్లారెడ్డి ఫంక్షన్హాల్లో జర్నలిస్టులకు ఏఐపై -నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు, ఏఐ నిపుణుడు ఉడుముల సుధాకర్ రెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు.
విరాహాత్ అలీ మాట్లాడుతూ.. ఏఐ కత్తిలాంటిదని, దానితో మంచి చెడులు రెండూ అంటాయని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ విలేకరులకు ఏఐపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మానవ మనుగడనే కొత్త మలుపు తిప్పుతున్న ఏఐతో మీడియా రంగంలోనూ ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. చాట్ జీపీటీ, జెమినాయ్, డీప్ఫేక్, నోట్బుక్ ఎల్ఎమ్, పర్ఫ్లెక్సిటీ తదితర ఏఐ టూల్స్ ద్వారా జర్నలిస్టుల పని మరింత సులువవుతుందన్నారు.
కానీ ఏఐని సక్రమంగా వినియోగించకపోతే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు సురేందర్, కృపాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యాదగిరి, విజయరావు, ఎల్లం, కృష్ణ, చిన్న యాదగిరి, రమణారెడ్డి, కిరణ్, జగదీశ్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, బాల్ నర్సయ్య పాల్గొన్నారు.
