
ముంబై: ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య పాల్పడింది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’షోలో సిమ్మీ ఖోస్లా పాత్రలో నటించిన సెజల్ శుక్రవారం ముంబై మీరా రోడ్డులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సెజల్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో ఆమె స్నేహితులు ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు.
‘సెజల్ ఆత్మహత్య వార్త వినగానే నేను షాక్ అయ్యాను. నేను కేవలం 10 రోజుల కిందటే సెజల్ను కలిశాను. మేమిద్దరం ఆదివారం కూడా వాట్సాప్లో చాట్ చేసుకున్నాము. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె బాగానే ఉంది. సెజల్ కుటుంబానికి ఈ రోజు ఉదయం ఆమె మరణ వార్త తెలిసింది. కానీ, సెజల్ నిన్న రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్లు నేను భావిస్తున్నాను. సెజల్ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఉదయపూర్కు తీసుకువెళ్లారు’ అని ‘దిల్ తో హ్యాపీ హై జీ’షోలో సెజల్తో పాటు నటించిన అరుల్ వర్మ తెలిపారు.
కాగా.. సెజల్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణం ఏంటనేది ఇంతవరకు తెలియలేదు. ఉదయపూర్ నుండి 2017లో ముంబై వచ్చిన సెజల్ శర్మ టీవీ నటిగా కొనసాగుతున్నారు. సెజల్ ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో నటించడానికి ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించింది. అంతేకాకుండా సెజల్ ‘ఆజాద్ పరిండి’ అనే వెబ్ సిరీస్లో కూడా నటించింది.
For More News..