- జీడిమెట్లలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఏరియాలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్న కెమికల్ట్యాంక్లో పడి ఇద్దరు కవల సోదరులు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..జీడిమెట్ల ఇండస్ట్రియల్ఎస్టేట్లోని సబూరీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొంతకాలంగా మూతపడి ఉంది. తిరిగి ప్రారంభించడానికి కొద్ది రోజులుగా రిపేర్లు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూర గ్రామానికి చెందిన రామ్(32) లక్ష్మణ్(32) కవల సోదరులు. వారు నాలుగు రోజులుగా కంపెనీలో ఫ్యాబ్రికేషన్పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కెమికల్ట్యాంక్ వద్ద పనిచేస్తుండగా రామ్..కెమికల్ట్యాంక్లో పడిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన లక్ష్మణ్ కూడా అందులోనే పడి చనిపోయాడు. అక్కడే ఉన్న వెంకట్రామ్రెడ్డి వారిని రక్షించే క్రమంలో రసాయన వాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యాడు.

