
22 రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్
మహబూబ్నగర్, వెలుగు: ఆడపిల్లలు పుట్టడంతో అదేరోజు కన్నతండ్రే కవలలకు పురుగుల మందు తాగించాడు. 22 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్పొందిన చిన్నారులు ఎట్టకేలకు కోలుకున్నారు. మహబూబ్నగర్జిల్లా గండీడ్ మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులకు తొలికాన్పులో పాప పుట్టింది. రెండో కాన్పు కోసం నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఈ నెల 1న జాయిన్ చేశారు. అదే రోజు కృష్ణవేణి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి హాస్పిటల్లో ఉన్న ఇద్దరు పిల్లలకు రాత్రి ఎవరూ చూడనప్పుడు పాలకు బదులు పురుగుల మందు తాగించాడు. పిల్లల నోటి నుంచి నురగ రావడం చూసిన సిబ్బంది ఆరా తీయగా తానే ఈ పనికి పాల్పడ్డట్టు కేశవులు ఒప్పుకున్నాడు. కేశవులుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన కోస్గి పోలీసులు ఈ నెల 3న రిమాండ్కు తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ నెల 4న మహబూబ్నగర్లోని ప్రైవేట్హాస్పిటల్కు తీసుకెళ్లారు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జి
డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్నారులు క్రమంగా కోలుకున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతలను చాలెంజ్గా తీసుకుని ట్రీట్మెంట్అందించినట్లు రవి చిల్డ్రన్హాస్పిటల్డాక్టర్శేఖర్నాయక్ చెప్పారు. మంగళవారం చిన్నారులను డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాస్పిటల్కు వెళ్లి చిన్నారులను చూశారు. తండ్రి జైలులో ఉండడంతో పిల్లల బాగోగులు చూసుకోవాలని జిల్లా ఆఫీసర్లకు సూచించారు. చిన్నారుల చదువుకు సహకరిస్తామని చెప్పారు.
For More News..