బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి దళిత బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు సుందిళ్ల బ్యారేజ్లో శవమై తేలాడు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించి, హత్య చేశాడని బాలిక పేరెంట్స్సహా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా.. నిందితుడు శవంగా మారడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగాంబాల బస్తీకి చెందిన బాలిక(17) అమ్మమ్మ వద్ద ఉంటోంది. బెల్లంపల్లిలోనే రామ్నగర్కు చెందిన సాజిద్(20)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలిక పేరెంట్స్ హైదరాబాద్లో ఉండగా.. ఆమె వాళ్ల వద్ద ఉంటూ.. మొన్నటి దాకా ఓ కాల్సెంటర్లో పని చేసేది. ఈ నెల12న ఉదయం జాబ్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన బాలిక.. అదే రోజు సాయంత్రం సాజిద్ను పెళ్లి చేసుకున్నట్లు, అతనితోపాటే ఉంటానని పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో పేరెంట్స్ మల్కాజ్గిరి పీఎస్లో మిస్సింగ్ కేసు పెడుతూ.. సాజిద్పై అనుమానమున్నట్లు చెప్పారు. పోలీసులు వారి కోసం గాలిస్తుండగా.. ఈ నెల16న జైపూర్ మండలం బెజ్జాల దగ్గర గోదావరి ఒడ్డున బాలిక శవం దొరికింది. సాజిద్ ప్రేమ పేరుతో వేధించి బాలికను రేప్ చేసి చంపాడని, అతడే శవాన్ని గోదావరి లో పడేశాడని ఆమె పేరెంట్స్సహా దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుండగానే.. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజ్ లో సాజిద్ మృతదేహం కనిపించింది. బాలికను చంపి సాజిద్ కూడా అదేరోజు చనిపోయాడా, పట్టుకుంటారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బాలిక, సాజిద్ల ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు.
బాలిక మృతి కేసులో ట్విస్ట్
- తెలంగాణం
- October 24, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు