వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

జీడిమెట్ల, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డ ఘటన నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండారి లే అవుట్​లోని వేగా అపెక్స్ అపార్ట్​మెంట్​లో ఉండే శ్రీకాంత్​, నాగసాయి దంపతులకు కూతురు సోమశ్రీ (2) ఉంది. శుక్రవారం సాయంత్రం నాగసాయి కూతురిని తీసుకుని ఇంటి ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్లింది.

సోమశ్రీ పార్కులో ఆడుకుంటుండగా.. వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలికను వెంటనే హాస్పిటల్​కు తరలించారు. అదే ఏరియాలో ఉండే శ్యామల(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా మరో కుక్క దాడి చేసి గాయపర్చింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు ఎక్కువయ్యాయని.. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.