ఓఆర్‌‌ఆర్‌‌పై ప్రమాదం.. ఇద్దరు మృతి

ఓఆర్‌‌ఆర్‌‌పై ప్రమాదం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా రావిర్యాల దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. అర్థరాత్రి ఓఆర్ఆర్ పై ఆగివున్న లారీని.. శంషాబాద్ నుంచి పెద్ద అంబర్ పేటకు వెళ్తున్న ట్రక్కు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరొకరు మృతి చెందారు. బీహార్ కు చెందిన ఉమేష్ తీవ్ర గాయాలతో ట్రక్కు ఇంజన్ లో ఇరుకున్నాడు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి రెండు జేసీబీలు, ఒక క్రేన్ సాయంతో అతడ్ని బయటకు తీశారు పోలీసులు. ప్రమాదం జరగగానే ఆగివున్న లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.