
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, టోలిచౌకి పోలీసులు ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టూ-వీలర్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.77 లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర తెలిపారు.
మహ్మద్ఇమ్రాన్ కారు డ్రైవర్ గా పని చేస్తూ సన్సిటీలో ఉంటున్నాడు. ఇతడు గంజాయి, హాష్ ఆయిల్కు బానిసై 2024లో డ్రగ్ పెడ్లింగ్ ప్రారంభించాడు. నాంపల్లి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత బెంగళూరులో డ్రగ్ వాడుతున్న వారితో సంబంధాలు ఏర్పరచుకుని, స్థానిక పెడ్లర్ల నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాస్ట్లను తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. 2024 చివరలో కంచన్బాగ్పోలీసులకు పట్టుబడ్డాడు.
2025 మార్చిలో విడుదలైన తర్వాత బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెచ్చి మళ్లీ నగరంలో అమ్మడం మొదలుపెట్టాడు. షేక్బషీర్అహ్మద్ అలియాస్సమీర్ఇంటర్మధ్యలో ఆపి దుబాయ్లో రెండేండ్లు సేల్స్మెన్గా పని చేసి 2016లో తిరిగి వచ్చాడు.
హుమాయున్ నగర్ లో ఉంటున్నాడు. తర్వాత మద్యం, ఎండీఎంఏకు బానిసయ్యాడు. తర్వాత పెడ్లర్గా మారి డ్రగ్స్అమ్మడం మొదలుపెట్టాడు. ఇమ్రాన్, సమీర్ఇద్దరూ కలిసి డ్రగ్స్దందా చేస్తుండడంతో విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్న్యూ, టోలిచౌకి పోలీసులు బుధవారం పట్టుకున్నారు.