
హైదరాబాద్, వెలుగు: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 4 ప్రాంతీయ కమిటీలను నియమించింది. నాలుగింటిలో ఒకటి దక్షిణ ప్రాంతీయ కమిటీ వేయగా, అందులో తెలంగాణకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.శంకర్ తో పాటు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వనజను నియమించారు.