2 వేల కోట్లతో సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతలు

2 వేల కోట్లతో సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతలు
  • ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, వెలుగు: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెరక ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2,100 కోట్లతో లిఫ్టు స్కీంలు చేపట్టాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది. నారాయణఖేడ్‌ జిల్లాలోని 80 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే లిఫ్ట్‌ పనులను రూ.700 కోట్లతో, జహీరాబాద్‌ నియోజకవర్గంలోని 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందజేసే ఎత్తిపోతలకు1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర సర్కారు లెక్కలు వేస్తోంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి 8 టీఎంసీలు, జహీరాబాద్‌ నియోజకవర్గానికి 15 టీఎంసీల నీళ్లు ఇచ్చేలా ప్లాన్స్‌ రెడీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ

ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్

రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు

ఆర్టీఏ సేవలకు ఆధార్ తప్పనిసరి