ఓఆర్ఆర్ పై రెండు లారీలు ఢీ..క్యాబిన్‌‌ లో చిక్కుకున్న డ్రైవర్

ఓఆర్ఆర్ పై రెండు లారీలు ఢీ..క్యాబిన్‌‌ లో చిక్కుకున్న డ్రైవర్

గండిపేట, వెలుగు: ఓఆర్​ఆర్​పై నార్సింగి సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్​ ఎయిర్​పోర్టు వైపు వెళ్తున్న రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఒక లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ లారీ డ్రైవర్ క్యాబిన్‌‌లోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. 

నార్సింగి పోలీసులు గ్యాస్ కట్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటికి తీశారు. ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎయిర్‌‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్లతో లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌‌ను క్లియర్ చేశారు.