YCP ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఇవాళ ఆమెను డాక్టర్లు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. రెండు వారాల పాటు రోజా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. రోజా ఆరోగ్య విషయంపై ఆమె భర్త సెల్వమణి ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు.
రోజాకు ఇది వరకే ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా.. గతేడాది కరోనా, ఈ జనవరిలో జరిగిన స్థానిక ఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.