ఇద్దరి మగవారి ప్రేమకథ.. తీరా కట్ చేస్తే

ఇద్దరి మగవారి ప్రేమకథ.. తీరా కట్ చేస్తే

ఆయన... ఆమెగా మారాడు.  అంతకు ముందు పెళ్లి చేసుకుంటానన్నాడు  కాని ఆమెగా మారిన తరువాత మొహం చాటేశాడు.  నిన్ను వివాహమాడతానన్నాడు.  తీరా నమ్మించి మోసాడని  స్ర్తీగా మారిన పురుషుడు పోలీసులను ఆశ్రయించాడు.  వికటించిన టూ మెన్స్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. . .

ప్రేమకు హద్దులు ఉండవంటారు.. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చెపితే తానా అంటే తందానా అంటారు.  సహజంగా స్త్రీ, పురుషులు ప్రేమించుకుంటారు. అక్కడక్కడా ఈ రోజుల్లో  ట్రాన్స్ జండర్లు కూడా ప్రేమించుకుంటున్నారనుకోండి.  అయితే ఇప్పుడు తాజాగా  ఓ వింత ప్రేమ ఘటన  బెజవాడలో వెలుగులోకి వచ్చింది.  వారిద్దరు పురుషులు.. భావి భారత పౌరులను తీర్చి దిద్దే అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు.  ఇద్దరు మగటీచర్లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిపై మరొకరికి వీపరీతంగా ప్రేమ పెరగడంతో ప్రేమికుడి కోసం మరో వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారాడు. కానీ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రియుడు మోసం చేయడంతో చివరకు ఈ ఇద్దరి మగటీచర్ల లవ్ స్టోరీ బెడిసికొట్టింది. దీంతో ప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్‌గా మారిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వింత ప్రేమ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల ప్రకారం.. బెజవాడకు చెందిన పవన్, నాగేశ్వర్ ఇద్దరు టీచర్లు. బీఈడీ చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పవన్ ప్రియుడు నాగేశ్వర్ రావు కోసం లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని భ్రమరాంభగా మారాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్న పవన్ ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేసుకుని భ్రమరాంభగా మారిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు నాగేశ్వర్ రావు నిరాకరించాడు. దీంతో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకుని మోసపోయానని గ్రహించిన భ్రమరాంభ (పవన్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న భ్రమరాంభ ప్రియుడు నాగేశ్వర్ రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నాగేశ్వర్ రావు కోసం పోలీసులు గాలిస్తు్న్నారు.