రిటైర్డ్​ ఎంపీడీవో హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. సుభద్ర హత్య కేసులోనూ ఇద్దరు..

రిటైర్డ్​ ఎంపీడీవో హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. సుభద్ర హత్య కేసులోనూ ఇద్దరు..

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా  పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్​ఎంపీడీవో  నల్ల రామకిష్టయ్య హత్య కేసులో  పరారీలో ఉన్న  దండుగుల తిరుపతి, దండుగుల రాజును పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్​కు  పంపారు. హత్యకు సహకరించిన మరో ఐదుగురిని ఈ మధ్య కాలంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. 

సుభద్ర హత్య కేసులో..

రిటైర్డ్​ ఎంపీడీవో హత్యకు సుపారీ ఇచ్చిన గిరబోయిన అంజయ్య బావమరిది భార్య గంగరబోయిన సుభద్రను  నిరుడు అక్టోబర్​ 20న హత్య చేశారు. భూమి కోసం సుభద్రను కూడా తానే హత్య చేయించానని విచారణలో అంజయ్య ఒప్పుకున్నాడు.  దీనికి అంజయ్య దగ్గర సుపారీ తసుకున్న బుసరాజు రాజేశ్​, పల్లపు నవీన్​ను  శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.