హైదరాబాద్ జూలోకి మాండ్రిల్స్

హైదరాబాద్ జూలోకి మాండ్రిల్స్

ఓల్డ్​సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ నెహ్రూ జూలాజికల్ పార్క్​లోకి కొత్తగా రెండు మగ మాండ్రిల్స్ (కోతి జాతి జంతువులు) వచ్చి చేరాయి. సుమారు 23 నెలల వయసున్న వీటిని గురువారం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ వినయ్ కుమార్, క్యూరేటర్ వసంత కలిసి సందర్శకుల కోసం ఎన్​క్లోజర్​లోకి విడుదల చేశారు. జంషెడ్‌‌పూర్ జూ నుంచి యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద ఈ మాండ్రిల్స్​ను తీసుకొచ్చారు.

 వాటికి బదులుగా హైదరాబాద్​ జూ నుంచి ఒక జత ఆఫ్రికన్ సింహాలను అక్కడికి పంపారు. గత నెలలోనే జూకు చేరుకున్న ఈ జంతువులను 45 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక గురువారం నుంచి ప్రజల సందర్శన కోసం అనుమతించారు. కొత్త జంతువుల చేరికతో ఈ వేసవిలో జూకి వచ్చే విజిటర్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూ డైరెక్టర్ డాక్టర్ సునీల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.