మెదక్ టౌన్, వెలుగు : చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కోక్కరికి రూ.7 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫస్ట్క్లాస్ సెషన్స్ జడ్జి శుభవల్లి తీర్పునిచ్చారని సోమవారం ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలను ఇతరులకు షేర్చేసినట్లు విచారణలో తెలిందన్నారు. స్పందించిన షీ- టీమ్ సిబ్బంది ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని వివరించారు.
అనంతరం 14 మే 2022న తూప్రాన్ పీఎస్లో అప్పటి ఎస్ఐ యాదగిరిరెడ్డి కేసు నమోదు చేయగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి అవసరమైన సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులైన మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలపై ఆరోపణలు రుజువు కావడంతో జడ్జి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్పీ వివరించారు.

