బైకులు ఢీకొని ఇద్దరు స్టూడెంట్స్ మృతి

బైకులు ఢీకొని ఇద్దరు స్టూడెంట్స్ మృతి

నేలకొండపల్లి, వెలుగు: రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూర మనోజ్(15), మీసాల సన్నీప్రసాద్(18) బైక్ పై నేలకొండపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా, కూసుమంచి రోడ్‎లో ఎదురుగా వస్తున్న బైక్  ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, సన్నీప్రసాద్​ అక్కడికక్కడే చనిపోయారు. మనోజ్​పదో తరగతి చదువుతుండగా, ప్రసాద్​డిగ్రీ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై సంతోష్  సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.