
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. శనివారం (అక్టోబర్ 04) నార్కట్పల్లి మండలం జివ్విగూడెం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లబావి కాలనీ సమీపంలోని ఓ గెస్ట్హౌస్లో ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు.
కామినేని విద్యాపీఠ్ స్కూల్కు చెందిన విద్యార్థులు 13 మంది స్విమింగ్ కోసం ఆ గెస్ట్హౌస్లోని స్విమింగ్పూల్కు వెళ్లగా.. ఈత రాని ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, నార్కట్పల్లి పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
స్విమ్మింగ్ పూల్ లో చాలా గాలింపు తర్వాత విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన విద్యార్థులు నార్కట్పల్లి చెందిన నల్లగొండ రిషిక్ (17), చౌటుప్పల్కు చెందిన పోలోజు హర్షవర్ధన్ (17) గా పోలీసులు గుర్తించారు.
►ALSO READ | 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లయిందని ఆస్పత్రిలో స్వీట్లు పంచిన నిందితుడు.. కట్ చేస్తే..
ఇది వరకు ఉన్న పాత బావిని స్విమింగ్పూల్గా మార్చడంతో.. అది లోతుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఇద్దరు విద్యార్థులు గల్లంతైన వార్త తెలిసి స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.