
వరంగల్ రూరల్ జిల్లా: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కపులకనపర్తి గ్రామంలోని ఊర చెరువులోకి నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్ళారు. వారిలో ఇద్దరు చనిపోయారు. చనిపోయినవారిని యశ్వంత్ 10 వ తరగతి, 5 వ తరగతి చదువుతున్నారు. అప్పటివరకు హోలీ పండుగలో ఆనందంగా గడిపిన కొడుకులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.