
ఎల్బీనగర్, వెలుగు: రాజస్థాన్ నుంచి సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఇద్దరిని సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన రామ్ బిస్నాయ్, దినేశ్ కుమార్ కొన్నేండ్ల కిందట సిటీకి వచ్చి పటాన్ చెరులో ఉంటూ స్టీల్ రెయిలింగ్ వర్క్ చేస్తున్నారు. డ్రగ్స్కు బానిసైన ఇద్దరూ రాజస్థాన్లోని ధర్మరామ్ అనే సప్లయర్ నుంచి తక్కువ ధరకు హెరాయిన్, ఓపీయం కొని సిటీకి తీసుకొచ్చి అమ్మేవారు. శనివారం సరూర్నగర్లో రామ్, దినేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 గ్రాముల హెరాయిన్, 100 గ్రాముల ఓపీయంను స్వాధీనం చేసుకున్నారు.
హాష్ ఆయిల్ సప్లయర్లు ఇద్దరు అరెస్ట్
మూసాపేట: చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాకు చెందిన యుగధర్ రాయ్(30), కవాసి మనోజ్(29) హాష్ ఆయిల్ను సిటీకి తెచ్చి అమ్మేవారు. శనివారం ఉదయం 8 గంటలకు జగద్గిరిగుట్టలోని దేవేందర్ నగర్ చౌరస్తా వద్ద వీరిద్దరిని బాలానగర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.7 లీటర్ల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.