వామ్మో..యూటర్న్స్! నాలుగేండ్లలో యూటర్న్ల వద్ద 366 యాక్సిడెంట్లు

వామ్మో..యూటర్న్స్! నాలుగేండ్లలో యూటర్న్ల వద్ద 366 యాక్సిడెంట్లు
  • గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 4 శాతం యూటర్న్​ల వద్దే..
  • లాంగ్​యూ టర్న్ లతో వాహనదారుల్లో అసహనం  
  • రాంగ్​రూట్లలో వెళ్తుండడంతో యాక్సిడెంట్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు:ట్రాఫిక్​మేనేజ్​మెంట్​లో భాగంగా నగరంలో యూ-టర్న్​లను ‘స్మార్ట్ సొల్యూషన్’గా ప్రవేశపెట్టినప్పటికీ అవి ట్రాఫిక్ జామ్​లు, యాక్సిడెంట్లకు, రాంగ్​రూట్​డ్రైవింగ్​కు కారణమవుతున్నాయి. ఇలా పలువురు ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుండగా, ఇంకొంతమంది గాయపడుతున్నారు. 

ఈ మధ్య బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 2021 నుంచి 2025 వరకు యూ-టర్న్​ల వద్ద 366 యాక్సిడెంట్లు జరగ్గా, 25 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 2024లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో నాలుగు శాతం యాక్సిడెంట్లు యూ టర్న్​ల వద్దే జరిగినట్టు తేలింది. 

వీటిలో ఎక్కువగా హబ్సిగూడ, ఉప్పల్, తార్నాక, జూబ్లీహిల్స్ వంటి ప్రధాన ఏరియాలున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో సిగ్నలింగ్​వ్యవస్థను ఎత్తేసి యూటర్న్​లు ఏర్పాటు చేయడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి యూ టర్న్​తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అంత ఓపిక లేని కొంతమంది రాంగ్​సైడ్​డ్రైవింగ్​చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. 

పక్కా ప్లాన్​లేకపోవడంతోనే.. 

ట్రాఫిక్​సమస్య పరిష్కారానికి గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో అధికారులు యూటర్న్​పద్ధతిని తీసుకువచ్చారు. నగరంలోని మేజర్​ఏరియాల్లోని సిగ్నల్స్​వద్ద వాహనాలు వందల మీటర్లు నిలిచిపోతుండడం, అన్ని చోట్లా నియమించేందుకు సరిపడా ట్రాఫిక్​సిబ్బంది లేకపోవడం, మెయింటనెన్స్​తగ్గించుకునేందుకు యూ టర్న్​విధానంవైపు మొగ్గు చూపారు. 

అయితే, దానికి తగ్గట్టు ప్లాన్​లేకపోవడంతో చాలా చోట్ల యూటర్న్​లు విఫలప్రయోగంగా నిలుస్తున్నాయి. రోడ్ల వెడల్పు చేయకపోవడం, డిజైన్ లోపాలుండడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి రకరకాల కారణాలతో యూ టర్న్​ల వద్ద ట్రాఫిక్​ఇబ్బందులతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 

ఒక్కో చోట కిలోమీటర్ల దూరంలో..

యూటర్న్​వ్యూహాల్లో భాగంగా కొన్ని చోట్ల పెట్టిన యూటర్న్​లు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఉదాహరణకు ఓయూ నుంచి హబ్సిగూడ, నాచారం వెళ్లాలనుకునే వాహనదారులు ఇంతకుముందు తార్నాక చౌరస్తా నుంచి సిగ్నల్​నుంచి వెళ్లిపోయేవారు. కానీ, దీన్ని మూసేసి దాదాపు కిలోమీటర్​కు పైగా దూరంలో ఉండే మెట్టుగూడ సమీపంలో యూటర్న్​ఇచ్చారు. దీంతో వాహనదారుల గమ్యస్థానం కళ్లెదుటే కనబడుతున్నా నిట్టూర్చుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. 

సోమాజిగూడ యశోద హాస్పిటల్​నుంచి నెక్లెస్​రోడ్డు రైల్వేస్టేషన్ కు మూడు వందల మీటర్లు కూడా ఉండదు. ఇంతకుముందు సమీపంలోని పెట్రోల్​బంక్​ఏరియా ఎదుట యూ టర్న్​ ఉండేది. దీన్ని మూసేసి సోమాజిగూడ సర్కిల్​లో యూటర్న్​కు ఆప్షన్​ఇచ్చారు. దీంతో యశోద నుంచి రైల్వేస్టేషన్​వెళ్లాలనుకునే పేషెంట్లు, ఇతర వాహనదారులు సోమాజిగూడ సర్కిల్​కు వెళ్లి టర్న్​తీసుకుని మళ్లీ యశోద మీదుగానే నెక్లెస్​రోడ్డు రైల్వేస్టేషన్​కు చేరుకోవాల్సి వస్తోంది. 

సరోజిని ఐ హాస్పిటల్​నుంచి మెహిదీపట్నం వెళ్లాలంటే 500 మీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఇక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లాలంటే మసాబ్​ట్యాంక్​ఫ్లై ఓవర్​వరకూ చేరుకోవాల్సి వస్తోంది. ఫ్లై ఓవర్​కింద యూ టర్న్​తీసుకుని మెహిదీపట్నం వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్లు ప్రయాణించాలి. పైగా ఈ దారిలో ట్రాఫిక్​జామ్​తో వాహనదారులు చుక్కలు చూడాల్సి వస్తున్నది.
 
లక్డీకాపూల్​బ్రిడ్జి దాటిన తర్వాత సైఫాబాద్​పోలీస్​స్టేషన్​మీదుగా వెళ్లి ఎలక్షన్​భవన్​ఎదురుగా యూటర్న్​తీసుకోవాలి. అయితే, సైఫాబాద్​పీఎస్​ఎదుట ఒక మెర్జింగ్​పాయింట్​పెట్టారు. లక్డీకాపూల్​నుంచి ఇంకో రూట్​లో వచ్చేవారు. మసాబ్​ట్యాంక్​వైపు వెళ్లాలంటే ఈ మెర్జింగ్​రూట్ లో రావాల్సి ఉంటుంది. అయితే, నాంపల్లి గల్లీల్లోంచి వచ్చే వారు ఎలక్షన్​భవన్​వరకూ వెళ్లకుండా  ఈ మెర్జింగ్​రూట్​లో రాంగ్​రూట్​లో వస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ఫీవర్​దవాఖాన దగ్గర తిలక్​నగర్​బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు విద్యానగర్​వెళ్లాలంటే..దాదాపు బర్కత్​పురా వరకూ వచ్చి యూటర్న్​ తీసుకోవాలి. దీంతో అది దూరంగా భావించి కోరంటి సిగ్నల్​నుంచే రాంగ్ రూట్​లో వెళ్లి విద్యానగర్​ రూల్​లో మెర్జ్​అవుతున్నారు. ఇక్కడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.  
మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద హైటెక్ సిటీ నుంచి మియాపూర్ వైపు వెళ్లే రోడ్డు క్లోజ్ చేశారు..హైటెక్ సిటీ నుండి వచ్చే వాహనాలు మియాపూర్ వెళ్లాలంటే 500 మీటర్ల దూరంలో ఉన్న యూటర్న్ వద్ద వాహనాలు మలుపుకొని మియాపూర్ వైపు వెళ్లాలి. యూటర్న్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.  

యాక్సిడెంట్లకు కేరాఫ్​ బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్స్​ 

ట్రాఫిక్​సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన యూటర్న్​ల వద్ద భారీగా ట్రాఫిక్​జామ్​ అవుతుఓంది. కొన్ని చోట్ల ఇది సుమారు 10- నుంచి15 నిమిషాల వరకూ ఉంటోంది. అలాగే, యూ-టర్న్​ల వద్ద మెర్జింగ్ సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల మెట్రో రూట్​ఉన్న ప్రాంతాల్లో రోడ్డు దాటే వారిని వాహనాలు ఢీకొని గాయపడుతున్నారు. ఈ క్రమంలో 2024లో హైదరాబాద్ పోలీసులు 54 యూ-టర్న్ బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్లను గుర్తించారు.
 వీటి వద్ద 11 యాక్సిడెంట్లు జరిగి 12  మంది చనిపోయినట్టు తేల్చారు. ఇందులో ఎక్కువ జరిగినవి బైక్​యాక్సిడెంట్లు కాగా, 8 మంది బైకర్లు కన్నుమూశారు. రాచకొండ పరిధిలో ఎన్​హెచ్​65పై 99 బ్లాక్‌‌‌‌‌‌‌‌స్పాట్లు ఉండగా, మూడు యూ-టర్నుల వద్ద 2022--–24 మధ్యలో 23 యాక్సిడెంట్లు జరిగి13 మంది చనిపోయారు. 

యూటర్న్​ల వద్ద వెహికల్స్​ స్లో అవుతుండగా.. స్ట్రెయిట్​గా వెళ్లేవారు అంచనా తప్పి వెనక నుంచి ఢీకొడుతున్నారు. అలాగే.. కొన్ని చోట్ల బస్సులు, లారీలు, వ్యాన్ల వంటి వాహనాలు రోడ్డుకు పూర్తిగా లెఫ్ట్​సైడ్​వచ్చి సడన్​గా యూ టర్న్​తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

లాంగ్ యూటర్న్​రూట్లలో లో ఎక్కువ వెహికల్స్​ఉండడం వల్ల అవి యూటర్న్​తీసుకొని లేన్​మారుతుండగా..ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొడుతున్నాయి. కిలోమీటర్ల కొద్దీ దూరంలో యూటర్న్​లు ఏర్పాటు చేయడం వల్ల రాంగ్​రూట్​వెళ్తూ కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎంతోమంది గాయపడుతున్నారు.

 లూప్​ తో సమస్యలు

నగరంలో చాలా చోట్ల ఈ లూప్​సమస్యలు వేధిస్తున్నాయి. ఒక జంక్షన్​లో యూటర్న్​గానీ, రైట్​టర్న్​గాని మూసేసేనప్పుడు నేరుగా కొంతదూరంలో యూటర్న్​ ఏర్పాటు చేస్తారు. దీంతో ఒకచోట యూ టర్న్​, రైట్​టర్న్​తీసుకోవాలనుకునే వారు అదనపు దూరాన్ని ప్రయాణించాల్సి వస్తుంది. తార్నాక, ఉప్పల్, కోరంటి, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో 
ఈ ఇష్యూ ఉంది. 

ఫలితాలు ఇవ్వట్లేదని  తార్నాక జంక్షన్​ క్లోజ్​ 

తార్నాక జంక్షన్ (ఫ్లైఓవర్ కింద) కొన్నేండ్ల కింద క్లోజ్​చేసిన చౌరస్తాను ట్రాఫిక్ పోలీసుల కొంతకాలం కింద ఓపెన్​చేశారు డ్రోన్ సర్వేలు, గూగుల్ ట్రాఫిక్ డేటా, సిగ్నల్ టైమింగ్ పరీక్షలు, ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా తెరిచినా..ఇక్కడ రోడ్డు వెడల్పు లేకపోవడం, మెట్రో స్తంభం రోడ్డు మధ్యలో ఉండటం వల్ల ట్రాఫిక్​సమస్య పెరుగుతుందని తేల్చారు. సిగ్నల్ ఉండడం వల్ల 30 సెకన్లకు అంతకుమించి వెయిట్​చేయాల్సి వస్తుందని సిగ్నల్​మళ్లీ క్లోజ్ చేశారు. కానీ, పర్మినెంట్​సొల్యూషన్​గురించి ఆలోచించలేదు. ఇతర చోట్లా ఇలాగే జరుగుతుందనే ఉహతో యూటర్న్​లను కంటిన్యూ చేస్తున్నారు.

ఏం చేయాలి?

  •     డ్రైవర్లు యూ-టర్న్‌‌‌‌‌‌‌‌ల వద్ద వేగాన్ని తగ్గించాలి..
  •     సేఫ్ ఫాలోయింగ్ డిస్టెన్స్ పాటించాలి.. 
  •     బ్లాక్‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌ల్లో సైన్‌‌‌‌‌‌‌‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలి.  
  •     లాంగ్​డిస్టెన్స్​లో ఉన్న యూటర్న్​ల దూరాన్ని తగ్గించాలి. 
  •     అవసరం ఉన్న చోట, ట్రాఫిక్​ సమస్యలు  తలెత్తే అవకాశం లేని ప్రాంతాల్లో సిగ్నల్స్​        ను పునరుద్ధరించాలి
  •     కొన్ని చౌరస్తాల్లో రైట్​టర్న్​లకు అనుమతి ఇవ్వాలి