దుబాయ్: అండర్–19 ఆసియా కప్లో ఇండియా సెమీస్తోనే సరిపెట్టుకుంది. బ్యాటింగ్లో ఫెయిలైన టీమిండియా శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. టాస్ ఓడిన ఇండియా 42.4 ఓవర్లలో 188 రన్స్కు ఆలౌటైంది. మురుగన్ అభిషేక్ (62), ముషీర్ ఖాన్ (50) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
బంగ్లా బౌలర్లు మరుఫ్ మ్రిదా (4/41), రోహనాత్ (2/39), షేక్ పవేజ్ జిబోన్ (2/29) ధాటికి ఇండియా 61కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, ముషీర్ ఏడో వికెట్కు 84 రన్స్ జోడించి ఆదుకున్నారు. తర్వాత బంగ్లాదేశ్ 42.5 ఓవర్లలో 189/6 స్కోరు చేసి గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అరిఫుల్ ఇస్లామ్ (94), అహ్రార్ అమిన్ (44) రాణించారు. మరో సెమీస్లో యూఏఈ 11 రన్స్ తేడాతో పాకిస్తాన్కు షాకిచ్చి టైటిల్ ఫైట్కు క్వాలిఫై అయ్యింది.